అర్ధరాత్రి ఏటీఎంలో చోరీకి యత్నం

by Disha Web Desk 7 |
అర్ధరాత్రి ఏటీఎంలో చోరీకి యత్నం
X

దిశ, పేట్ బషీరాబాద్ : ఏటీఎంలో చొరబడిన దుండగులు మిషన్‌ను ధ్వంసం చేసి చోరీకి ప్రయత్నించిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఇద్దరు దొంగలు షాపూర్ నగర్‌లో ఉన్న ఎస్‌బిఐ ఏటీఎంలోకి చొరబడ్డారు. తొలుత సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఏటీఎం ను తెరిచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందడంతో జీడిమెట్ల పోలీస్‌లను అలెర్ట్ చేశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుంటున్న పోలీసుల రాకను పసిగట్టిన దుండగులు అక్కడ నుంచి పరారయ్యారు. చోరి యత్నానికి పాల్పడింది బిహార్, యూ పీ రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed